ఖమ్మం : టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే అభివృద్ధికి ఓటు వేసినట్లేనని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. బుధవారం నగరంలోని 35వ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి బోజెడ్ల రాంమ్మోహన్రావు విజయాన్ని కాంక్షిస్తూ ఆ డివిజన్లో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్, యువనేత కేటీఆర్ ఖమ్మం నగరాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారని, హైదరాబాద్ తర్వాత ఖమ్మం నగరమే అత్యంత అభివృద్ధి చెందిందన్నారు.
నగరాభివృద్ధికి అడిగిన వెంటనే నిధులు ఇచ్చారన్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు. గతంలో ఖమ్మం మున్సిపాలీటీని పాలించిన కాంగ్రెస్ పార్టీ, సీపీఎం పార్టీలు చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు.
అభివృద్ధిని అడ్డుకోవడమే ప్రతిపక్షాల పని అన్నారు. నగరంలో రోడ్డ విస్తరణ, సెంట్రల్ లైటింగ్, జంక్షన్ల నిర్మాణం, పార్కుల అభివృద్ధి, ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేశామన్నారు. గతంలో పాలించిన వారు ఏం చేశారని ప్రశ్నించారు.
ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ 35వ డివిజన్ అధ్యక్షుడు బాలిన శ్రీనివాస్, కార్యదర్శి కళావతి, నాయకులు బోజెడ్ల చరణ్, కిలారు రమణారెడ్డి, కొనకంచి ఆంజనేయులు, దేశగాని రవి, బాలిన రమేశ్ , పువ్వాడ శ్రీనివాస్ తదితరరులు పాల్గొన్నారు.
కొండగొర్రె మాంసం విక్రేతల అరెస్ట్
సూర్యాపేట జిల్లాలో ఈదురు గాలుల బీభత్సం
స్వీయ నియంత్రణయే శ్రీరామ రక్ష : మంత్రి ఎర్రబెల్లి
సీఎం కేసీఆర్ కోలుకోవాలని పూజలు