కొల్లాపూర్, జూన్ 15: తెలంగాణలో రైతులు సాగు పెట్టుబడి కోసం షావుకార్లు, వడ్డీ వ్యాపారస్తులను ఆశ్రయించకుండా సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం దేశానికే ఆదర్శమని ఎంపీపీ సభావట్ భోజ్యనాయక్, సింగిల్విండో చైర్మన్లు పెబ్బేటి కృష్ణయ్య, చింతకుంట శ్రీనివాసులు అన్నారు. వానకాలం పంటసాగు పెట్టుబడులకు మంగళవారం రైతుల బ్యాంకు ఖాతాల్లో ఎకరాకు రూ.5వేల చొప్పున ప్రభుత్వం జమ చేయడంతో టీఆర్ఎస్ శ్రేణులు, ప్రజాప్రతినిధులు కొల్లాపూర్ పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. రైతులకు పెట్టుబడి సాయం చేయడంతో ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ కాటం జంబులయ్య, ఎంపీటీసీలు పాండునాయక్, శంకర్నాయక్, టీఆర్ఎస్ నాయకులు రామచందర్యాదవ్, ఖాదర్పాషా, కలమందశ్రీను, బండిశ్రీను, సంపంగి నర్సింహ తదితరులు పాల్గొన్నారు.
పెంట్లవెల్లిలో..
పెంట్లవెల్లి, జూన్ 15: మండల కేంద్రంలోని సింగిల్విండో కార్యాలయ ఆవరణలో మంగళవారం రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఆయా గ్రామాల రైతులు, ప్రజాప్రతినిధులు క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో సింగల్ విండో చైర్మన్ విజయరామారావు ,జిల్లా కోఆప్షన్ సభ్యులు మతీన్, జటప్రోల్ సర్పంచ్ ఎస్కే ఖాజా, సింగిల్విండో డైరక్టర్లు రేణు, బాలరాజు, వల్లయ్య, మాజీ ఎంపీటీసీ వెంకటస్వామి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
అమ్రాబాద్లో..
అమ్రాబాద్, జూన్ 15: మండలంలోని మన్ననూర్ గ్రామంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రవీందర్రెడ్డి ఆధ్వర్యంలో, పదరలో మండల వర్కింగ్ అధ్యక్షుడు శ్రీనివాసులు ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం నిర్వహించారు. కార్యక్రమాల్లో సర్పంచ్ శ్రీరామ్నాయక్, పుల్లయ్యయాదవ్, వెంకటేశ్, షమి, మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.
పెద్దకొత్తపల్లిలో..
పెద్దకొత్తపల్లి, జూన్ 15: మండలంలోని ముష్టిపల్లి, గంట్రావుపల్ది, వెన్నచెర్ల తదితర గ్రామాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి టీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో క్షీరాభిషేకం చేశారు. మండల కేంద్రంలోని రైతువేదిక వద్ద జెడ్పీటీసీ గౌరమ్మ, సింగిల్విండో చైర్మన్ శ్రీనివాసులు, పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాసులు, సర్పంచులు అదేవిధంగా వెన్నచెర్ల రైతువేదిక వద్ద ఎంపీపీ ప్రతాప్గౌడ్, సర్పంచ్ రాధ, ఎంపీటీసీ రవికుమార్ ముఖ్యమంత్రి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.కార్యక్రమంలో మండల నాయకులు గణేశ్రావు, నాగరాజు, చంద్రయ్య, రవినాయక్, రాజశేఖర్, మాజీ సర్పంచ్ నరసింహ, ధర్మారెడ్డి, సర్పంచ్ రాంలాల్, ఉపసర్పంచ్ జగన్ తదితరులు పాల్గొన్నారు.
కోడేరులో..
కోడేరు, జూన్ 15: కోడేరులోని రైతువేదిక వద్ద సీఎం కేసీఆర్ చిత్రపటానికి మంగళవారం క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు రంగినేని జగదీశ్వర్రావు, సర్పంచ్ వెంకటస్వామి, టీఆర్ఎస్ తాలూకా నాయకులు పవన్కుమార్రెడ్డి, గ్రామ అధ్యక్షుడు శ్రీశైలం, నాయకులు శేఖర్యాదవ్, ఎస్ఎంసీ కమిటీ చైర్మన్ శేఖర్, హర్షన్న యువసేన మండలాధ్యక్షుడు చంద్రశేఖర్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
పొంగిపొర్లిన రైతు సంబురం
అచ్చంపేట రూరల్, జూన్ 15: వానకాలం ప్రారంభమైన సందర్భంగా రైతుల ఖాతాల్లో రైతుబంధు నగదు జమ అవుతుండడంతో రైతులు ఆనందరం వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని పల్కపల్లి, పులిజాల, నడింపల్లి, ఐనోలు, బొమ్మన్పల్లి, సిద్ధాపూర్, ఘణపూర్, రంగాపూర్ గ్రామాల్లోని రైతువేదికల వద్ద మంగళవారం సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలతో అభిషేకాలు చేసి మిఠాయిలు పంచుకున్నారు. కార్యక్రమాల్లో సింగిల్విండో చైర్మన్ రాజిరెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు రాజేశ్నాయక్, సోని, లోక్యానాయక్, బోడ్కానాయక్, మున్సిపల్ చైర్మన్ నర్సింహగౌడ్, నాయకులు పరమేశ్, సతీశ్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు.
లింగాలలో..
లింగాల, జూన్ 15: మండల కేంద్రంలోని ఏకలవ్య విగ్రహం ఎదుట సీఎం కేసీఆర్, విప్ గువ్వల బాలరాజు చిత్రపటానికి సింగిల్విండో చైర్మన్ హన్మంత్రెడ్డి మంగళవారం క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రానోజీ, సర్పంచులు తిరుపతయ్య, సింగిల్విండో వైస్ చైర్మన్ వెంకటగిరి, నాయకులు మల్లేశ్, రైతులు దేవయ్య, లక్ష్మణ్ పాల్గొన్నారు.