హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఈఏపీసెట్ (ఎమ్సెట్) నోటిఫికేషన్ మరో నాలుగు రోజుల్లో విడుదల కానుంది. ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఈఏపీసెట్) నోటిఫికేషన్ను జూన్ 24న విడుదల చేస్తామని ఏపీ విద్యాశాఖ ప్రకటించింది. ఈమేరకు షెడ్యూల్ను విడుదల చేసింది. ఆన్లైన్ అప్లికేషన్లు గురువారం నుంచి ప్రారంభమవుతాయని, జూలై 25 వరకు అందుబాటులో ఉంటాయని అధికారులు వెల్లడించారు. ఆలస్య రుసుముతో ఆగస్టు 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. పరీక్షను ఆగస్టు 19 నుంచి 25 వరకు నిర్విహిస్తామని తెలిపారు.
ఈ ప్రవేశపరీక్ష ద్వారా ఆంధ్రప్రదేశ్లోని ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. తెలంగాణలో కూడా పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.