ఖమ్మం : విధుల్లో అలసత్వం వహించిన వైద్యులపై చర్యలు తీసుకోవాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. బుధవారం మంత్రి రఘునాధపాలెం మండలం మంచుకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని(PHC) సందర్శించారు. కొవిడ్ టెస్ట్ సెంటర్ను తనిఖీ చేశారు. పరీక్షల కోసం వచ్చిన వారి అవస్థలు చూసి దవాఖాన సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
టెస్ట్ల కోసం ఉదయం వచ్చి పడిగాపులుకాస్తున్నామని అయినా ఎవరు పట్టించుకోవడం లేదని మంత్రి పువ్వాడ దృష్టికి తీసుకొచ్చారు. నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న ఆయా వైద్యులపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, డీఎంహెచ్వోను ఆదేశించారు.
కరోనా పరీక్షల కోసం వచ్చిన వారికి కనీస సదుపాయాలు, టెంట్ కూడా వేయలేరా అని ఎంపీడీవో, తహసీల్దార్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పరీక్షల కోసం వచ్చిన వారికి సకాలంలో పరీక్షలు జరిపి పంపించాలని ఆదేశించారు.
ఇవి కూడా చదవండి..
మానవత్వం చాటిన ముస్లిం యువకులు..
పేదరికంతో రోడ్డున పడ్డ కుటుంబం..ఆదుకున్న మంత్రి సత్యవతి
కరోనా కట్టడిలో ఎన్నారైలు భాగస్వాములు కావాలి
కరోనా లక్షణాలు ఉన్న అందరికి మందులు ఇవ్వండి