లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సంబాల్ జిల్లాలోని చౌందసీ పట్టణంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా ఓ పత్రికలో పనిచేస్తున్న జర్నలిస్టు రవి నిండు చూలాలు అయిన తన భార్యకు పురిటి నొప్పులు రావడంతో పట్టణంలోని ఓ నర్సింగ్ హోమ్కు తీసుకెళ్లాడు. అప్పటికే సమయం రాత్రి 10 గంటలు అవుతున్నది. నర్సింగ్ హోమ్లో ఇద్దరు డాక్టర్లు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. కానీ ఇండ్లకు వెళ్లిపోయే తొందరలో ఉన్న వాళ్లు సదరు మహిళకు డెలివరీ చేసేందుకు నిరాకరించారు.
దంపతులిద్దరూ ఎంత బతిమాలినా వినిపించుకోలేదు. చివరికి తాను జర్నలిస్టునంటూ రవి హెచ్చరిక ధోరణిలో చెప్పినా అయితే ఏంటని నిర్లక్ష్యంగా మాట్లాడారు. రవి భార్య పురిటినొప్పులతో విలవిల్లాడుతున్నా ఏ మాత్రం మానవత్వం చూపకుండా ఆస్పత్రి నుంచి బయటికి వెళ్లిపొమ్మంటూ ఆమెకు డోర్ చూపించారు. సిబ్బంది దురుసు ప్రవర్తనను రవి తన ఫోన్లో వీడియో తీసేందుకు ప్రయత్నించగా అతనిపై దాడిచేశారు.
ఇద్దరినీ అమానుషంగా బయటికి గెంటేశారు. అయితే అప్పటికే పురిటి నొప్పులు మరింత ఎక్కువ కావడంతో రాత్రి 11 గంటల సమయంలో బాధితురాలు నర్సింగ్ హోమ్ ముందే బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వైద్యులు శరద్, మౌనికలపైన ఆరుగురు సిబ్బందిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
కాంగ్రెస్ కంచుకోటల్లో మమత పాగా.. కారణం తెలుసా..?
పవన్ సరసన టాలెంటెడ్ నటి..!
Long COVID : కరోనా తగ్గినా దీర్ఘకాలికంగా మూడు లక్షణాలు..!