జడ్చర్లటౌన్, మే 24 : మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మీరవీందర్ అన్నా రు. కరోనా ఉధృతి నేపథ్యంలో మున్సిపాలిటీలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు సోమవారం మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. అంతకుముందు పారిశుధ్య కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సత్వరమే కార్మికుల సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం 8,20వ వార్డుల్లో పర్యటించారు. వార్డుల్లో నెలకొన్న సమస్యలను పరిశీలించారు. ప్రధానంగా మురుగు కా ల్వలు, తాగునీటి సమస్యలను గుర్తించి వెంటనే చర్యలు తీసుకోవాలని ము న్సిపల్ సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సునీత, కౌన్సిలర్ శ్రావణి, టీఆర్ఎస్ నాయకులు రవీందర్, కృష్ణారెడ్డి, శ్యామ్, అబ్దుల్లా పాల్గొన్నారు.