పుణె: ఇంగ్లాండ్తో జరుగుతున్న మూడో వన్డేలో భారత్ స్వల్ప వ్యవధిలోనే రెండు వికెట్లు కోల్పోయింది. ఇంగ్లాండ్ స్పిన్నర్ అదిల్ రషీద్ తన వరుస ఓవర్లలో ఓపెనర్లను పెవిలియన్ పంపాడు. 15వ ఓవర్లో ముందుగా హిట్మ్యాన్ రోహిత్ను అద్భుతమైన గుగ్లీ వేసి బౌల్డ్ చేసిన రషీద్ 17వ ఓవర్లో మరో చక్కని బంతి విసిరి ధావన్ను పెవిలియన్ పంపాడు.
నాలుగో బంతిని ధావన్ రిటర్న్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. క్రీజులో కుదురుకున్న ఓపెనింగ్ జోడీని రషీద్ విడదీసి స్కోరు వేగానికి అడ్డుకట్ట వేశాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ(6), రిషబ్ పంత్(1) క్రీజులో ఉన్నారు. 17 ఓవర్లకు భారత్ 2 వికెట్లకు 118 రన్స్ చేసింది.