హైదరాబాద్ : తెలంగాణ సచివాలయంలోకి సాధారణ సందర్శకుల అనుమతిపై నిషేధం విధిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు సచివాలయంలో ప్రభుత్వం తాత్కాలిక పాసులను రద్దు చేసింది. సంబంధిత అధికారి అనుమతి ఉంటేను సందర్శకులకు అనుమతి ఇవ్వనున్నారు. థర్మల్ స్ర్కీనింగ్ చేశాకే సదరు సందర్శకులకు అనుమతి ఉంటుంది. కొవిడ్ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.