తుప్పుపట్టి.. నిరూపయోగంగా మారిన పోలీస్ వాహనాన్ని ఇలా అంబులెన్స్గా మార్చారు రాచకొండ పోలీసులు. కొవిడ్ కారణంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో సీపీ మహేశ్భగవత్ చొరవతో సుమారు 8 లక్షలు వెచ్చించి..మూలనపడ్డ వాహనాన్ని ఆక్సిజన్ బెడ్స్తో కూడిన అంబులెన్స్గా తీర్చిదిద్దారు. ఇప్పటికే సుమారు పదికి పైగా అంబులెన్స్లను వివిధ సంస్థల సహకారంతో నడిపిస్తున్న పోలీసులు… తాజాగా ఈ ప్రాణవాయువు బండిని కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. గురువారం ఎల్బీనగర్ రాచకొండ పోలీసు కమిషనర్ క్యాంపు కార్యాలయంలో సీపీ మహేష్ భగవత్ ఈ అంబులెన్స్ను జెండా ఊపీ ప్రారంభించారు. పోలీసు సిబ్బంది, పౌరుల అత్యవసర సేవల కోసం దీనిని ఉపయోగించనున్నారు.