నిజామాబాద్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ దవాఖానలో అగ్నిప్రమాదం జరిగింది. శనివారం ఉదయం హాస్పిటల్లోని సీటీ స్కాన్ రూమ్లో మంటలు చెలరేగాయి. దీంతో సీటీ స్కాన్ యంత్రం, కంప్యూటర్ దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు అంటుకున్నాయని అధికారులు తెలిపారు. కాగా, దవాఖానలో ఒక్కసారిగా పొగలు కమ్ముకోవడంతో రోగులు, వారి సహాయకులు భయాందోళనకు గురయ్యారు.
గుజరాత్లోని భారుచ్లో ఉన్న పటేల్ వెల్ఫేర్ కరోనా దవాఖానలో అగ్నిప్రమాదం సంభవించింది. దవాఖానలోని కరోనా వార్డులో అర్ధరాత్రి దాటిన తర్వాత మంటలు చెలరేగాయి. దీంతో 18 మంది మరణించారు. నాలుగు అంతస్తుల ఈ హాస్పిటల్లో 50 మంది రోగులు ఉన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..