హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) నూతన డైరెక్టర్గా డాక్టర్ వినయ్ నందికూరి నియమితులయ్యారు. ప్రముఖ మాలిక్యూలర్ బయాలజిస్ట్గా పేరొందిన ఆయన, న్యూఢిల్లీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యూనాలజీలో స్టాఫ్ సైంటిస్ట్గా ఉన్నారు. టీబీ వ్యాధికి కారణమయ్యే మైకోబ్యాక్టీరియం ట్యుబర్క్యులోసిస్ కణాల సిగ్నలింగ్ నెట్వర్క్పై ఆయన పరిశోధన చేసి అంతర్జాతీయ గుర్తింపు పొందారు. ముంబైలోని ఐఐటీ, బెంగళూరు ఐఐఎం, టెక్సాస్ ఏఅండ్ఎం యూనివర్సిటీ అండ్ యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియాలో విద్య, పరిశోధనా శిక్షణ పూర్తిచేశారు. ప్రఖ్యాత జేసీ బోస్ ఫెలోషిప్ను పొందిన ఆయన, ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ, నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఇండియా ఫెలోగా ఎన్నికయ్యారు. పూర్వ సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. రాకేశ్మిశ్రా ప్రస్తుతం టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్ అండ్ సొసైటీ డైరెక్టర్గా, వివిధ పరిశోధనలు పూర్తయ్యే నిమిత్తం సీసీఎంబీ సలహాదారుడిగా వ్యవహరించనున్నారు.