వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి
వనపర్తి, జూన్ 30 (నమస్తే తెలంగాణ): పల్లె, పట్టణప్రగతితో గ్రామాలు, పట్టణాల రూపురేఖలు మారాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం వనపర్తిలో పల్లె, పట్టణప్రగతి, హరితహారంపై నిర్వహించిన సన్నాహక సమావేశంలో మంత్రి ప్రసంగించారు. పర్యావరణ పరిరక్షణకు ఐక్యరాజ్యసమితి తీర్మానానికి ముందే తెలంగాణలో సీఎం కేసీఆర్ మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారని కొనియాడారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్రెడ్డి, ఆల వెంకటేశ్వర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.