హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి చేపట్టిన పల్లె ప్రగతి, ఇతర అభివృద్ధి కార్యక్రమాలను గ్రామ కార్యదర్శులు అంకితభావంతో అమలు చేయాలని పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కోరారు. బంజారాహిల్స్లోని మినిస్టర్ క్యాంపు కార్యాలయంలో బుధవారం జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సంఘం బాధ్యులు మంత్రిని కలిశారు. తమ నెలసరి వేతనం 15 వేల రూపాయల నుంచి 28,719 రూపాయలకు పెంచినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
ఉద్యోగుల సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని మంత్రి తెలిపారు. అందులో భాగంగా రాష్ట్ర ఖజానాపై భారం పడుతున్నప్పటికి జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నెల వేతనాన్ని పెంచామన్నారు. కార్యదర్శులు మరింత ఉత్సహంతో పనిచేసి గ్రామాల అభివృద్ధికి నిరంతరం కృషి చేయాలని అయన కోరారు.
ప్రస్తుతం భారీగా వర్షాలు పడుతున్నందున గ్రామాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా ప్రత్యేకంగా పారిశుధ్య కార్యక్రమాలను చేపట్టాలని అయన సూచించారు. ప్రతిరోజు ట్రాక్టర్, ట్రాలీల ద్వారా తడి, పొడి చెత్తను సేకరించి గ్రామంలోని డంపింగ్ యార్డుకు తరలించాలన్నారు. హరితహారం మొక్కలు పెరిగేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
మంత్రిని కలిసిన వారిలో జూనియర్ పంచాయతీరాజ్ కార్యదర్శుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గౌరినేని రాజేశ్వర్, సంఘం బాధ్యులు శశిధర్ గౌడ్, నరేష్, మల్లికార్జున్, రమేష్, తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
విషాదం : నీటి గుంటలో పడి బాలుడు మృతి
హనుమంతరావును పరామర్శించిన గవర్నర్ దత్తాత్రేయ
ముంబైని ముంచెత్తుతున్న వానలు.. వీడియో
మెరుపు వేగంతో భూమి వైపు దూసుకొస్తున్న భారీ ఆస్టరాయిడ్