హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ హరితదీక్షకు పల్లెప్రకృతి వనాలు ప్రతిరూపాలుగా మారాయని ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు పేర్కొన్నా రు. ‘సీఎం కేసీఆర్ ప్రత్యేకమైన, మార్గదర్శక ఆలోచన గొప్ప ఫలితాలను చూపుతున్నది. పల్లెప్రకృతి వనంతో ప్రతి గ్రామంలో ఒక పా ర్క్ ఏర్పాటైంది. స్థానిక సంస్థల బడ్జెట్లో 10 శాతం నిధులు పచ్చదనం కోసం కేటాయించడం గొప్ప ఫలితాలను ఇచ్చింది’అంటూ గురువారం ట్విట్టర్లో పల్లెప్రకృతి వనాల ఫొ టోలను షేర్ చేశారు.