ఇల్లందకుంట, సెప్టెంబర్ 13 : గ్రామాల అభివృద్ధే టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంటలో రూ.72 లక్షలతో చేపట్టనున్న పనులకు సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ.. పనులు జరిగినప్పుడు ప్రజలు దగ్గరుండి నాణ్యతతో చేయించుకోవాలని సూచించారు. అనంతరం స్థానిక రేణుకా ఎల్లమ్మ దేవాలయం, గొల్ల, కుర్మల కమ్యూనిటీ హాల్ నిర్మాణాల స్థల పరిశీలన చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, సర్పంచ్ శ్రీలత, ఎంపీటీసీ విజయ్కుమార్ పాల్గొన్నారు.