కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ తెలుగులో తొలిసారి తన సినిమాను ప్రమోషన్స్ చేసుకుని మరీ విడుదల చేసుకున్నాడు. ఈయన నటిచిన తాజా చిత్రం యువరత్న కన్నడంతో పటు తెలుగులోనూ ఏప్రిల్ 1న విడుదలైంది. కేజీయఫ్ లాంటి భారీ సినిమాను నిర్మించిన హోంబళే ఫిల్మ్స్ ఈ సినిమాను నిర్మించింది. పునీత్ ఎవరో ఇక్కడ తెలియకపోయినా కూడా ‘అఖిల్’ ఫేమ్ సాయేషా సైగల్.. ప్రకాశ్ రాజ్, సాయికుమార్ లాంటి తెలిసిన నటీనటులు ఉన్నారు ఈ సినిమాలో. నైజాంలో ఈ సినిమాను దిల్ రాజు విడుదల చేశాడు. దీంతోపాటు మరికొన్ని ఏరియాల్లో కూడా పెద్ద డిస్ట్రిబ్యూటర్లకే ఇచ్చారు. కానీ కలెక్ష్లన్స్ విషయంలో మాత్రం పవర్ స్టార్ పాచిక పారలేదు. రెండు రోజుల్లో యువరత్న సినిమా తీసుకొచ్చిన వసూళ్లు ఇప్పుడు చూద్దాం..
నైజాం- 10 లక్షలు
సీడెడ్- 7 లక్షలు
ఉత్తరాంధ్ర- 8 లక్షలు
ఏపీ + తెలంగాణ(టోటల్)- 25 లక్షలు షేర్
యువరత్న చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో కేజీయఫ్ నిర్మాతలు డిస్ట్రిబ్యూట్ చేశారు. చాలా వరకు వాళ్లే ఈ చిత్రాన్ని ఓన్ రిలీజ్ చేసుకున్నారు. అయినా కూడా రూ.55 లక్షలు వస్తే కానీ పునీత్ సినిమా బ్రేక్ ఈవెన్ కానట్లే..! రెండు రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.25 లక్షల షేర్ రాబట్టింది. సినిమాకు మంచి టాక్ వచ్చింది కాబట్టి కచ్చితంగా మరో రూ.25 లక్షలు కూడా ఈ రెండు రోజుల్లో వస్తుందని నమ్ముతున్నారు నిర్మాతలు. ‘వైల్డ్ డాగ్’ ‘సుల్తాన్’ లాంటి సినిమాలతో పోటీ పడి యువరత్న ఎంతవరకు రేసులో ముందుకెళ్తాడో చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి