నల్లగొండ : విజయదశమి పండుగ జిల్లా ప్రజలకు అన్ని రంగాలలో విజయం చేకూర్చాలని, జిల్లా అన్ని రంగాలలో అగ్రభాగంలో ఉండాలని కోరుతూ డిఐజి ఏ.వి. రంగనాధ్ ఆకాంక్షించారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలోని ఆర్ముడ్ రిజర్వ్ విభాగంలో డిఐజి రంగనాధ్, సతీమణి లావణ్య రంగనాధ్ ఆయుధ పూజ, వాహన పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా దుర్గా దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
శక్తికి ప్రతీకగా నిలిచే దుర్గామాత సమక్షంలో ప్రతి ఆయుధానికి ఎంతో శక్తి కలిగి ఉంటుందని అలాంటి విజయాలను చేకూర్చే విజయదశమి పర్వదినోత్సవం అందరికి సుఖ సంతోషాలు కలిగించాలని ఆకాంక్షించారు.
పోలీస్ శాఖలో ప్రతి స్థాయిలోని అధికారి ప్రజా రక్షణలో ముందుంటూ మన్ననలు అందుకుంటూ పోలీస్ శాఖ గౌరవం మరింత పెరిగేలా పని చేయాలన్నారు. అనంతరం ఎం.టి. విభాగం వద్ద వాహనాల పూజ నిర్వహించి శుభాకాంక్షలు తెలిపారు.
పూజా కార్యక్రమాలలో డిటిసి ఎస్పీ సతీష్ చోడగిరి, అదనపు ఎస్పీ నర్మద, ఏ.ఆర్. డీఎస్పీ సురేష్ కుమార్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు నర్సింహా చారి, శ్రీనివాస్, సిబ్బంది జలీల్, లియాఖత్, లాజర్, ఖాసీం డ్రైవర్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.