హైదరాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో డెయిరీ ఫాంలకు ఆస్తి పన్ను మినహాయింపు, విద్యుత్ బిల్లుల రాయితీతో విజయ డెయిరీకి ఎంతో ప్రయోజనం చేకూరుతున్నదని ఆ సంస్థ చైర్మన్ లోకా భూమారెడ్డి తెలిపారు. రాష్ట్రప్రభుత్వం నిర్ణయంతో విజయ డెయిరీకి ప్రతి ఏటా రూ.2.56 కోట్లు ఆదా అవుతాయని అన్నారు. ఆస్తి పన్ను రద్దుతో రూ.56 లక్షలు, విద్యుత్ రాయితీతో రూ.2 కోట్లు ఆదా అవుతాయని వివరించారు. గత ఏడాది విజయ డెయిరీ రూ.8.93 కోట్ల విద్యుత్ బిల్లులు చెల్లించిందని, ప్రభుత్వ రాయితీతో ఇందులో రూ.2 కోట్లు తగ్గుతుందని వెల్లడించారు. విజయ డెయిరీకి, పాడి రైతులకు మేలుచేసేలా నిర్ణయం తీసుకొన్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.