సూర్యాపేట టౌన్, ఏప్రిల్ 5 : సెలూన్, లాండ్రీ షాపులకు ఉచిత విద్యుత్కు సంబంధించిన జీఓను ప్రభుత్వం విడుదల చేయడంపై ఆయా వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. నాయీబ్రాహ్మణులు, రజకసంఘం నాయకులు సోమవారం క్యాంపు కార్యాలయంలో మంత్రి జగదీశ్రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. శాలువాతో సన్మానించారు. పుష్పగుచ్ఛాలు అందించి అభిమానాన్ని చాటుకున్నారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, తెలంగాణ నాయీ బ్రాహ్మణ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ జంపాల శ్రీను, గొట్టిపర్తి లింగయ్య, కొత్తపల్లి వీరయ్య, జంపాల వీరబాబు, పిన్నెల్లి వెంకటేశ్, గుంటి సైదులు, రాక్ రాజేశ్, సాయికుమార్, రజక సంఘం నాయకులు కొండూరు సత్యనారాయణ, చెరుకు వెంకన్న, చెన్నయ్య, జయమ్మ, సోమయ్య, కృష్ణ పాల్గొన్నారు.
మంత్రిని కలిసిన బార్ అసోసియేషన్ నాయకులు
సూర్యాపేట బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులు సోమవారం క్యాంపు కార్యాలయంలో మంత్రి జగదీశ్రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గుడిపూడి వెంకటేశ్వర్రావు, ఉపాధ్యక్షుడు గుంటూరు మధు, కార్యదర్శి బత్తిని వెంకటేశ్వర్లు, ఎ. వెంకటేశ్వర్రావు, అబ్దుల్ లతీఫ్, కె. వెంకటేశ్వర్లు, మామిడి మట్టయ్య, గోండ్రాల అశోక్, తళ్లమల్ల హస్సేన్ పొల్గొన్నారు.
పుష్పగుచ్ఛం అందించిన అదనపు కలెక్టర్
జిల్లా అదనపు కలెక్టర్గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన మోహన్ రావు మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుచ్ఛం అందించారు.
పంచాంగాన్ని ఆవిష్కరించిన మంత్రి
జిల్లా వైదిక బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన ఫ్లవ నామ సంవత్సర పంచాంగాన్ని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వేద పండితులు మంత్రికి పంచాంగం అందించి ఆశీర్వచనం చేశారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ గుజ్జ దీపికా యుగంధర్రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్గౌడ్, జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ, మంత్రమూర్తి శంకరమూర్తి, ధరూరి సింగరాచార్యులు, రాఘవా చార్యులు, ఆదిత్య శర్మ, సతీశ్కుమారశర్మ, పులి అచ్యుత శర్మ, హరిప్రసాద్, లక్ష్మణ శర్మ తదితరులు పాల్గొన్నారు.
ఇవీ కూడా చదవండి…
కాంట్రాక్టర్ నిర్లక్ష్యం..అధికారుల అలసత్వం
జాగ ఉన్న పేదలందరికీ డబుల్ ఇండ్లు