అమీన్పూర్, జూన్ 5 : కరోనాపై విజయం సాధించాలంటే ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి సూచించారు. శనివారం బీరంగూడ జిల్లా పరిషత్ హైస్కూల్లో హైరిస్క్ వ్యాక్సినేషన్ డ్రైవ్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారిని తరిమి కొట్టేందుకు కలిసి కట్టుగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి, వైస్ చైర్మన్ నర్సింహాగౌడ్, మున్సిపల్ కమిషనర్ సుజాత, కౌన్సిలర్లు, అధికారులు, టీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్రెడ్డి, ఉపేందర్రెడ్డి, చంద్రశేఖర్, జగదీశ్ కార్యకర్తలు పాల్గొన్నారు.
మౌలిక వసతుల కల్పనకు కృషి
అమీన్పూర్ మున్సిపాలిటీలో మౌలిక వసతుల కల్పనకు నిరంతరం కృషి చేస్తానని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. శనివారం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని లింగమయ్య కాలనీలో పది లక్షల రూపాయలతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. మున్సిపాలిటీ పరిధిలో తాగునీటి సౌకర్యం, పారిశుధ్యం పనులకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా ఆయన చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి, వైస్ చైర్మన్ నర్సింహాగౌడ్, మున్సిపల్ కమిషనర్ సుజాత, కౌన్సిలరు ్ల మల్లేశ్, కో ఆప్షన్ సభ్యుడు తలారి రాములు కార్యకర్తలు పాల్గొన్నారు.
వ్యాక్సినేషన్ డ్రైవ్ను సద్వినియోగం చేసుకోవాలి
బొల్లారం, జూన్ 5 : కరోనా నియంత్రణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వ్యాక్సినేషన్ డ్రైవ్లను సద్వినియోగం చేసుకోవాలని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి కోరారు. శనివారం బొల్లారం మున్సిపాలిటీ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హైరిస్క్ వ్యాక్సినేషన్ సెంటర్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సమాజంలో కరోనాకు గురయ్యే అవకాశం అధికంగా ఉన్న వర్గాల వారికి విడతలుగా వ్యాక్సిన్ అందించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఫ్రంట్లైన్ వారియర్స్కి వ్యాక్సినేషన్ వేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజేంద్రకుమార్, కౌన్సిలర్ చంద్రారెడ్డి, మాజీ జడ్పీటీసీ బాల్రెడ్డి, ఆర్వో శ్రీధర్, డాక్టర్ రాధిక, ఆయా వార్డుల కౌన్సిలర్లు పాల్గొన్నారు.