హైదరాబాద్ : పంజాగుట్టలోని నిమ్స్ దవాఖానలో కొవిడ్ టీకాలు వృథా అయ్యాయన్న ఆరోపణలపై విజిలెన్స్ అధికారులు విచారణ నిర్వహిస్తున్నారు. దవాఖాన సిబ్బందిని విచారించి పూర్తి వివరాలు తెలుసుకుంటున్నారు. నిమ్స్ సిబ్బంది నిబంధనలు ఉల్లఘించి 18 నుంచి 44 ఏండ్ల మధ్య వారికి టీకాలు వేసినట్లు ఇటీవల ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ వ్యవహరంపై విచారణ జరపాలని ప్రభుత్వం విజిలెన్స్ అధికారులను ఆదేశించింది. దవాఖానలో సుమారు 7 వేలకుపైగా టీకాలు దుర్వినియోగం అయినట్లు ఆరోపణలు ఉన్నాయి. విజిలెన్స్ విచారణ పూర్తయితే ఎన్ని టీకాలు దుర్వినియోగం అయ్యాయో స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది.
ఎంజీఎంలో బ్లాక్ ఫంగస్కు ప్రత్యేక చికిత్స వార్డు ప్రారంభం
రేపటి నుంచి ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు వ్యాక్సినేషన్
కరోనా వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకున్న మంత్రి సత్యవతి
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.