జడ్చర్లటౌన్, ఏప్రిల్ 2: కరోనా సెకెండ్ వేవ్ నేపథ్యంలో 45 ఏండ్లు దాటిన వారందరూ తప్పనిసరిగా కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలని, దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించాలని డీఎంహెచ్వో కృష్ణ సూచించారు. జడ్చర్లలోని అర్బన్ హెల్త్ సెంటర్ను డీఎంహెచ్వో శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా అర్బన్ హెల్త్ సెంటర్లో కొవిడ్ పరీక్షలు, వ్యాక్సినేషన్పై డాక్టర్ శివకాంత్ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి డాక్టర్ కృష్ణ మాట్లాడుతూ కొవిడ్ లక్షణాలు కలిగిన వారు దవాఖానలకు వెళ్లి కరోనా పరీక్షలు చేయించుకోవాలని పిలుపునిచ్చారు. కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా ప్రజలందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించి భౌతికదూరాన్ని పాటించాలని, ఎప్పటికప్పుడూ శానిటైజర్తో చేతులు శుభ్రం చేసుకోవాలని సూచించారు. కొవిడ్ విషయంలో వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో డాక్టర్లు సునీల్, నాగరాజు, శ్రీను, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.
టీకా తప్పని సరిగా వేయించుకోవాలి
భూత్పూర్, ఏప్రిల్ 2: 45ఏండ్లు దాటిన ప్రతిఒక్కరూ తప్పని సరిగా టీకా వేయించుకోవాని డీఎంహెచ్వో కృష్ణ సూచించారు. మండల కేంద్రంలోని పీహెచ్సీని శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా టీకా పంపిణీపై ఆరా తీశారు. ప్రతి రోజూ వంద మంది వరకు టీకా పంపిణీ చేయాలని సూచించారు. కార్యక్రమంలో సీహెచ్వో రామయ్య, సూపర్వైజర్ యాదమ్మ, ఏఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు.
కరోనా టీకా తీసుకోండి: డీఐవో శంకర్
దేవరకద్ర రూరల్, ఏప్రిల్ 2: 45 ఏండ్లు పైబడిన ప్రతిఒక్కరూ కరోనా టీకా తీసుకోవాలని డీఐవో శంకర్ పిలుపునిచ్చారు. శుక్రవారం దేవరకద్ర ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. మండలంలోని అన్ని గ్రామాల్లోని ప్రజలు దేవరకద్ర ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తమ పేరును నమోదు చేసుకుని కరోనా టీకా తీసుకోవాలన్నారు. కరోనా రెండో దశ వేగంగా విస్తరిస్తున్న సందర్భంగా అందరూ తగిన జాగ్రత్తలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.