జమ్మికుంట, జూలై 6: హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రలోభపర్వం మొదలైంది. ఉపఎన్నిక రాక ముందే బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ ప్రజల ను వచ్చిక చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తున్నది. కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు కోట్లాది విలువైన కుట్టుమెషిన్లు, గోడ గడియారాలు తెప్పించి ఓ గోదాంలో నిల్వ చేసినట్టు జోరుగా ప్రచారం సాగుతున్నది. మంగళవారం మధ్యాహ్నం నుంచి సోషల్ మీడియాలో ఓ వీడియో చక్కర్లు కొడుతున్నది. వాచీలపై ఈటల ఫొటో, బీజేపీ గుర్తు ఉన్న పోస్టులు పెద్ద ఎత్తున షేర్ అయ్యాయి. సీఎం కేసీఆర్కు, టీఆర్ఎస్కు నియోజకవర్గంలో ఉన్న ఆదరణను చూసి ఓడిపోతామనే భయంతోనే ఇలాంటి తాయిలాలకు సిద్ధపడుతున్నారని టీఆర్ఎస్ నాయకులు మండిపడుతున్నారు.