శ్రీశైలం: ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీశైల మల్లికార్జున స్వామివారి ఆలయంలో ఉగాది మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడో రోజైన నేడు.. భ్రమరాంబాదేవి మహా సరస్వతీ అలంకారంలో దర్శనమివ్వనున్నారు. సాయంత్రం భ్రమరాంబ, మల్లికార్జునస్వామివార్లకు నంది వాహన సేవ నిర్వహిస్తారు. అదేవిధంగా ప్రభోత్సవం, వీరాచారి విన్యాసాలు ఉంటాయి. ఉగాది మహోత్సవాలు ఈనెల 14న ముగుస్తాయి.
ఉగాది సందర్భంగా ఆలయంలో రేపు పంచాంగ శ్రవణం ఉంటుంది. మంగళవారం సాయంత్రం స్వామి అమ్మవార్ల రథోత్సవం, అమ్మవారికి రమావాణి సేవిత రాజరాజేశ్వరి అలంకారం చేస్తారు. ఉత్సవాల్లో చివరి రోజైన 14వ తేదీన స్వామిఅమ్మవార్లకు అశ్వవాహన సేవ, భ్రమరాంబదేవి అమ్మవారికి నిజాలంకరణ చేస్తారు. ఉత్సవాలకు రాష్ట్రం నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తారు. కరోనా నేపథ్యంలో భక్తులకు అలంకార దర్శనం మాత్రమే కల్పించనున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..