పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో పలు రాష్ట్రాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఈ క్రమంలోనే తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ లాంటి చోట్ల థియేటర్లలో ఆంక్షలు విధించారు. ఢిల్లీ మినహా మిగిలిన మూడు రాష్ట్రాలలో 50 శాతం ఆక్యుపెన్సీ నడుస్తుంది. మరోవైపు ఢిల్లీలో కేవలం 30 శాతం మాత్రమే ఉండాలని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదేశాలు జారీ చేశారు.
ఈ క్రమంలోనే తెలుగు ఇండస్ట్రీలో కూడా 50 శాతం ఆక్యుపెన్సీ అమలు చేస్తారని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతానికి థియేటర్లలో ఎలాంటి ఆంక్షలు లేవు. జాగ్రత్తలు తీసుకొని ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయాలని ప్రభుత్వం సూచిస్తుంది. అయితే ఎంత చేసినా కూడా కేసులు మాత్రం ఆగడం లేదు. దాంతో థియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీ తీసుకురావాల్సిందే అంటూ డిమాండ్స్ వినిపిస్తున్నాయి.
మరి దీనిపై టాలీవుడ్ నిర్మాతలు ఏమంటున్నారు.. వాళ్ళ రియాక్షన్స్ ఏంటి అనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ 50 శాతం ఆక్యుపెన్సీ తీసుకొస్తే పరిస్థితి ఏంటి అనే దానిపై ఒక సీనియర్ నిర్మాత మాట్లాడుతూ.. టాలీవుడ్ దేనికి సిద్ధంగానే ఉంది అని చెప్పుకొచ్చాడు. ఓటిటిలో విడుదల చేసుకునే కంటే 50% ఆక్యుపెన్సీతో విడుదల చేసుకోవడం బెటర్ కదా అంటున్నాడు ఆయన. ఇప్పటికే చాలా సినిమాలు వాయిదా పడ్డాయి. ఒకవేళ థియేటర్ల ఆక్యుపెన్సీ తగ్గిస్తే అప్పుడు కలెక్షన్స్ కూడా తగ్గుతాయి. మరి దీనిపై నిర్మాతలు ఏమంటారో చూడాలి.