ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్
సిద్దిపేట కలెక్టరేట్, జూన్ 5 : రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో నిర్మిస్తున్న జిల్లా సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాల నిర్మాణ పనులపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ బీఆర్కేఆర్ భవన్ నుంచి జిల్లా కలెక్టర్లు, సీనియర్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ల నిర్మాణం, ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల ఏర్పాటు, కొత్త మెడికల్, నర్సింగ్ కాలేజీలకు భూముల బదలాయింపు, ధరణి పోర్టల్కు సంబంధించిన విషయాలపై సీఎస్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి, అదనపు కలెక్టర్ ముజామ్మిల్ఖాన్ పాల్గొన్నారు.
ధరణి దరఖాస్తుల పరిష్కారం కోసం
ప్రత్యేక చర్యలు
ధరణి పెండిగ్ దరఖాస్తులను ఐదు రోజుల్లో పూర్తి చేసేందుకు జిల్లాలోని అన్ని మండలాల తహసీల్దార్లకు పలు ఆదేశాలు జారీ చేశారు. కాన్ఫరెన్స్లో డీఆర్వో చెన్నయ్య, ఆర్డీవోలు అనంతరెడ్డి, జయచంద్రారెడ్డి, విజేందర్రెడ్డి, తహశీల్దార్లు, ధరణి ఆపరేటర్లు పాల్గొన్నారు.