వికారాబాద్ : నూతన రేషన్ కార్డులతో లబ్ధిదారులకు ఎంతో మేలు జరుగుతుందని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తెలిపారు. సోమవారం వికారాబాద్ పట్టణంలోని శివరాంనగర్ కాలనీలో లబ్ధిదారులకు చేసిన రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు రేషన్ కార్డులు మంజూరు చేస్తామన్నారు. రేషన్ కార్డులు తీసుకున్న లబ్ధిదారులు వచ్చే నె ఆగస్టు నెల నుంచి రేషన్ బియ్యం తీసుకోవచ్చని తెలిపారు.
నూతన రేషన్ కార్డుల జారీ పంపిణీ ప్రక్రియ విడతల వారీగా చేపడుతామన్నారు. కార్యక్రమంలో వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ మంజుల, వైస్ చైర్పర్సన్ శంషాద్బేగం, పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్రెడ్డి, కౌన్సిలర్ గాయత్రి, నాయకులు లక్ష్మణ్, గిరీష్కొటారీ, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
ఛత్తీస్గఢ్ పోలీసులకు చిక్కిన టైగర్ హుంగా
పేదల కడుపు నింపేందుకే కొత్త రేషన్ కార్డులు
Tokyo Olympics: చరిత్ర సృష్టించిన 13 ఏళ్ల నిషియా
గంభీర్కు చుక్కెదురు.. స్టే ఇవ్వలేమన్న సుప్రీం