వరంగల్ అర్బన్ : నిషేధిత గుట్కా అమ్ముతున్న వ్యక్తిని టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన వరంగల్ అర్బన్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చేటుచేసుకుంది. నిందితుడిని మొహమ్మద్ చాంద్ పాషాగా గుర్తించారు. ఇతడి వద్ద నుండి రూ. 54,400 విలువైన గుట్కాను, రూ. 20 వేల నగదు, ఓ స్కూటర్ను స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు నిందితులు హైదరాబాద్కు చెదిన సయ్యద్ జావీద్, కరణ్ పరారీలో ఉన్నట్లు టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ సి.శ్రీనివాస్ తెలిపారు.