హుజూరాబాద్ రూరల్, ఆగస్టు 14 : హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్కు తమ సంపూర్ణ మద్దతు తెలుపుతూ హుజూరాబాద్ మండలంలోని వెంకట్రావుపల్లి దళితులు ఏకగ్రీవంగా తీర్మానించారు. దళితుల ఆర్థిక అభ్యున్నతే లక్ష్యంగా దళితబంధు ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సీఎం కేసీఆర్ను అభినవ అంబేదర్ అని కొనియాడారు. శనివారం గ్రామానికి వచ్చిన టీఆర్ఎస్ నాయకుడు, సైదాపూర్ మండల సర్పంచుల ఫోరం ప్రధాన కార్యదర్శి కాగిత రాములుకు తీర్మాన ప్రతిని అందజేశారు. ఈ సందర్భంగా పలువురు దళితులు మాట్లాడుతూ.. దళిత బంధు పథకంలో భాగంగా ప్రతి దళిత కుటుంబానికి ఈ పథకం వర్తించేలా సీఎం చర్యలు తీసుకోవడంతోపాటు ఇప్పటికే రూ.500 కోట్లు విడుదల చేయడంపై హర్షం వ్యక్తంచేశారు.
ఈ పథకం ద్వారా తమ కుటుంబాలను ఆర్థికంగా అభివృద్ధి చేసుకోవడంతోపాటు సమాజంలో ఆర్థిక అసమానతలు లేకుండా ఎదుగుతామని పేరొన్నారు. తమలాగే నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో దళిత కుటుంబాలు గెల్లు శ్రీనివాస్కు మద్దతుగా ఏకగ్రీవ తీర్మానాలు చేసి ఉప ఎన్నికల్లో గెలిపించి సీఎం కేసీఆర్కు కానుకగా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 16న జరిగే సీఎం బహిరంగ సభకు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తిరుమల తిరుపతి, టీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు నరకుడు మధుకర్, మారెట్ కమిటీ మాజీ చైర్మన్ కన్నెబోయిన శ్రీనివాస్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.