హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ): తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు మూడేండ్ల చొప్పున సలహాదారుగా పనిచేసిన వెంకట్ చెంగవల్లి అస్కీ నేతృత్వంలోని ‘వాష్ ఇన్నోవేషన్ హబ్’కు సీఈవోగా నియమితులయ్యారు. తెలంగాణ ప్రభుత్వ సహకారంతో దేశంలోనే మొదటిదైన వాష్ (వాటర్, శానిటేషన్, హైజీన్)ను ఆయన అభివృద్ధి చేయనున్నారు. ఈ సంస్థలో ఆవిష్కరణలను ప్రోత్సహించడమే కాకుండా ఔత్సాహికులు తమ లక్ష్యాలను సాధించే విధంగా శిక్షణ ఇచ్చే బాధ్యతను తనపై ఉంచారని వెంకట్ ఒక ప్రకటనలో వెల్లడించారు. మూడేండ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు.