రోడ్డు ప్రగతికి చిహ్నం.. ఏ ప్రాం తంలో రోడ్ నెట్ వర్క్ బాగుంటే, ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఆర్అండ్బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఆర్అండ్బీ కింద 31,937 కిలోమీటర్ల రోడ్లు ఉన్నాయని చెప్పారు. గత ఆరేండ్లలో రోడ్ల కోసం రూ. 20,564 కోట్లతో పనులు చేపట్టినట్టు తెలిపారు. తెలంగాణ ఏర్పాటుతర్వాత 21 ఆర్ఓబీ, ఆర్యూబీలు పూర్తిచేయగా.. మరో 11 నిర్మాణ దశలో ఉన్నాయని చెప్పారు. నూతన సచివాలయం అన్ని హంగులతో సిద్ధమవుతుందని పేర్కొన్నారు. రీజినల్ రింగ్ రోడ్డు భూ సేకరణలో 50 శాతం చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైందని చెప్పారు.
సత్వర న్యాయానికి కృషి: మంత్రి ఇంద్రకరణ్రెడ్డి
కొత్త కోర్టుల ఏర్పాటు, పోస్టుల మంజూరు, సత్వర న్యాయం కోసం తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకుంటున్నదని న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. 2020-21లో 46 న్యాయస్థానాల ఏర్పాటుకు అనుమతులిచ్చామని, 1,733 పోస్టులను మంజూరు చేశామని చెప్పారు. పోక్సో చట్టం కింద సత్వర న్యాయమందించేందుకు 36 ప్రత్యేక ఫాస్ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతిచ్చిందన్నారు. న్యాయవాదుల సంక్షేమం కోసం రూ.3 కోట్లతో ట్రస్ట్ ఏర్పాటు చేశామని చెప్పారు. నల్సార్ అభివృద్ధి, ఈ-పుస్తకాల సదుపాయం, అకాడమిక్ బ్లాక్ విస్తరణ, ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ తదితరాల కోసం రూ.30 కోట్లు కేటాయించినట్టు తెలిపారు.