ముప్కాల్/వేల్పూర్, సెప్టెంబర్ 21: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అబద్ధాల కోరు, పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఒక దొంగ అని గృహనిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ రాష్ర్టానికి 2.5 లక్షల ఇండ్లు ఇచ్చాడని చెప్తున్న బండి సంజయ్ అవి ఎక్కడ ఉన్నాయో చూపించాలని డిమాండ్ చేశారు. 2.5 లక్షల ఇండ్లు చూపించలేకపోతే ఎంపీతోపాటు పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం నల్లూర్లో 33/11 కేవీ సబ్స్టేషన్కు మంత్రి మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ‘సెంట్రల్ హౌసింగ్ సెక్రటరీని తీసుకుని నువ్వు రా.. రాష్ట్ర హౌ సింగ్ కార్యదర్శితో నేనూ వస్తా.. మోదీ ఇచ్చిన ఇండ్లు రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయో చూద్దాం. ఎవరు ఎంత ఇస్తున్నారో బహిరంగంగా చర్చిద్దాం. నా వాదన తప్పయితే మంత్రి పదవికి రాజీనామా చేసేందుకు నేను రెడీ. రెండున్నర లక్షలకు ఒక్కటి తగ్గినా ఎంపీ పదవికి, బీజేపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసేందుకు బండి సంజయ్ సిద్ధమా’ అని వేముల సవాల్ విసిరారు. సీఎం కేసీఆర్ కట్టించే ఒక్కో డబుల్బెడ్రూంకు గ్రామాల్లో రూ.5.4 లక్షలు ఖర్చు అవుతున్నదని, కేంద్రం ఇచ్చే రూ.75 వేలతో ఇల్లు పూర్తవుతుందా? అని ప్రశ్నించారు. తెలంగాణలో ఉన్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల్లో కనీ సం పదోవంతు కూడా బీజేపీ పాలిత రాష్ర్టాల్లో అమలుకావడం లేదని చెప్పారు. 40 లక్షల మందికి ఆసరా పెన్షన్ల కోసం రాష్ట్ర ప్ర భుత్వం ఏటా రూ. 8వేల కోట్లు ఖర్చుచేస్తుండగా కేంద్రం రూ.200 కోట్లే ఇస్తున్నదని చెప్పారు. బండి సంజయ్, రేవంత్రెడ్డి ఇద్దరూ సీఎం కేసీఆర్ కాలిగోటికి సరిపోరని విమర్శించారు. వారికి దమ్ము, ధైర్యం ఉంటే బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో తెలంగాణ పథకాల్లో పదోవంతైనా అమలు చేయించాలన్నారు.
టీఆర్ఎస్లో పలువురి చేరిక
నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు మంగళవారం వేల్పూరులోని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి నివాసంలో టీఆర్ఎస్లో చేరారు. యూత్ కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు మర్రి గౌతమ్తోపాటు క్యాతం మధు, గడ్డం రాము, కనుగుర్తి శంకర్ తదితరులకు మంత్రి గులాబీ కండువా కప్పి టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు.