నల్లగొండ : తెలంగాణ వ్యాప్తంగా లాక్డౌన్ అమలవుతున్న విషయం తెలిసిందే. లాక్డౌన్ను పోలీసులు పకడ్బందీగా అమలు చేస్తున్నారు. నాగార్జునసాగర్ కొత్త బ్రిడ్జి వద్ద ఏపీ నుంచి తెలంగాణలోకి అనుమతి లేకుండా వస్తున్న వాహనాలను పోలీసులు ఆపేశారు. దీంతో అక్కడ కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. లాక్డౌన్ సడలింపు సమయంలోనూ అనుమతులు తప్పనిసరి అని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. తెలంగాణలో ఉదయం 6 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు మాత్రమే లాక్డౌన్ నుంచి సడలింపు ఉంది.