నమస్తే తెలంగాణ నెట్వర్క్, మే 24: యూనివర్సిటీలకు నియమితులైన ఉప కులపతులు సోమవారం ఆయా యూనివర్సిటీల్లో నిరాడంబరంగా బాధ్యతలు చేపట్టారు. శాతవాహన, పాలమూరు, తెలంగాణ, జేఎన్ఏఎఫ్ఏ యూ వైస్ చాన్స్లర్లుగా ప్రొ సంకశాల మల్లేశం, ప్రొ లక్ష్మీకాంత్రాథోడ్, ప్రొ డీ రవీందర్గుప్తా, ప్రొ కవిత దర్యాని బాధ్యతలు స్వీకరించారు. వీరు మూడేండ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు. ఉస్మానియా, శాతవాహన యూనివర్సిటీల వీసీలు ప్రొ. డీ రవీందర్యాదవ్, ప్రొ. మల్లేశంను ప్రభుత్వ విప్ బాల్క సుమన్ సోమవారం మర్యాద పూర్వకంగా కలిసి సత్కరించారు.