తుర్కపల్లి: దళితబంధు నిధులను సద్వినియోగం చేసుకోని దళితులు ఆర్థికంగా ఎదగాలని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్రెడ్డి అన్నారు. ఆమె బుధవారం మండలంలోని వాసాలమర్రి గ్రామాన్ని సందర్శించి దళితబంధు నిధుల విని యోగం యూనిట్ల ఎంపికపై దళితులతో ఏర్పాటు చేసిన అవగాహన సమా వేశంలో మాట్లాడారు.
సీఎం కేసీఆర్ వాసాలమర్రి గ్రామాన్ని దత్తత తీసుకోని దళితబంధు పథకాన్ని రాష్ట్రంలోనే ప్రథమంగా గ్రామంలో ప్రవేశపెట్టి 76దళిత కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున నిధులను అందించడం గ్రామస్తుల అదృ ష్టమన్నారు. లబ్ధిదారులు ఒకటి కి పదిసార్లు ఆలోచించుకోని యూనిట్లను ఎంపిక చేసుకోవాలన్నారు. యూ నిట్ల నిర్వహణలో సందేహలు ఉంటే అధికారు లను సంప్రదించి నివృత్తి చేసుకోవాలన్నారు.
దళితులు ఆత్మగౌరవంతో తల ఎత్తుకోని జీవించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ దళితబంధు నిధులను అందిస్తున్నారని దానిని దృష్టిలో ఉంచుకోని నిధులు దుర్వినియోగం కాకుండా ఎంచుకున్న రంగాలలో పెట్టుబ డులు పెట్టి కష్టపడి పనిచేసి ఆర్థికంగా ఎదగాలన్నారు. యూనిట్ల నిర్వాహణపై అధికారుల సూచనలు, సలహలు తీసుకోవాలన్నారు. ఇప్పటికే జిల్లా లో విజవంతంగా నడుస్తున్న కోళ్ల పెంపకం పాడి, గొర్రెల పెంపకంతో పాటు హర్టికల్చర్పై లబ్ధిదారులకు అధికారులు క్షేత్ర పరిశీలన చేయించి అవగాహన కల్పించారన్నారు.
మహిళలు పేపర్ప్లేట్లు,అప్పడాలు, అగర్బత్తి వంటి చిన్న తరహ పరిశ్రమలు ఏర్పాటు చేసుకుంటే వారు ఉత్పత్తి చేసిన సరుకులకు అధికారులు మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తారన్నారు. ఈనెల 17న వాసా లమర్రిలోని దళితవాడలను 10 మంది ఫ్రొపెసర్ల బృందం సందర్శించి యూనిట్ల నిర్వహణపై అధ్యయనం చేయడంతో పాటు సలహలు అందజేస్తారన్నారు.
సమావేశంలో ఎంపీపీ భూక్యా సుశీల, జడ్పీ వైస్ చైర్మన్ భీకూనాయక్, ఎంపీటీసీ పలుగుల నవీన్కుమార్, ఎస్సీ కార్పొరే షన్ ఈడీ శ్యాంసుందర్, పీఏసీఎస్ చైర్మన్ సింగిరెడ్డి నరసింహారెడ్డి, నాయకులు సుంకరి శట్టయ్య, నరేందర్రెడ్డి, కల్లూరి ప్రభాకర్రెడ్డి, బబ్బూరి రవీందర్గౌడ్, కర్ణాకర్రెడ్డి, భాస్కర్నాయక్, శంకర్ నాయక్, శ్రీకాంత్, కర్ణాకర్ పాల్గొన్నారు.