యాదాద్రి భువనగిరి : వాసాలమర్రి గ్రామానికి దళిత బంధు నిధులను మంజూరు చేయడంతో గురువారం వాసాలమర్రి దళిత కుటుంబాలు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. నిన్న దత్తత గ్రామం వాసాలమర్రికి వచ్చిన సందర్భంగా సీఎం వాసాలమర్రి నుంచే దళిత బంధు పథకానికి శ్రీకారం చుట్టారు. 76 కుటుంబాలకు రూ.10 లక్షలు వెంటనే అకౌంట్లలో జమ చేస్తామని ప్రకటించారు. ఊహించని వరంతో స్థానిక దళిత కుటుంబాలు సంతోషంలో ఉన్నాయి. ఈ క్రమంలో గురువారం డప్పుచప్పుల్లతో సందడి చేశారు. కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేసి ఆయనపై తమకు ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు.