వరంగల్ రూరల్ : వర్ధన్నపేట మండల కేంద్రంలోని సీహెచ్సీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సూపర్ స్ప్రెడర్స్ వ్యాక్సినేషన్ సెంటర్ ను వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. దవాఖానలో అందుతున్న వైద్య సేవల గురించి వైద్యులను, స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కరోనా పరీక్షలు, మందుల పంపిణీ, వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా చూడాలని వైద్యులకు సూచించారు.
ప్రతి ఒక్కరు మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలని ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో వరంగల్ రూరల్ డీఏంహెచ్వో మధుసూదన్, మున్సిపల్ కమిషనర్ రవీందర్, ఏంపీపీ, జడ్పీటీసీ స్థానిక నాయకులు, కార్యకర్తలు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
ట్రాక్టర్ బోల్తా..మహిళ మృతి, 15 మందికి గాయాలు