అమరావతి : ఆంధప్రదేశ్ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబుపై మరో కేసు నమోదైంది. గుంటూర్ జిల్లా కేంద్రంలోని అరండల్ పేట పోలీసులు ఆయనపై మంగళవారం కేసు నమోదు చేశారు. కరోనాపై ప్రజలను భయపెట్టాలా చంద్రబాబు మాట్లాడారని స్థానిక న్యాయవాది అనిల్ కుమార్ ఫిర్యాదు చేయడంతో ఆయనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఇప్పటికే చంద్రబాబుపై కర్నూల్ వన్టౌన్ పోలీసు స్టేషన్లో ఇదే తరహా కేసు నమోదైంది. రాష్ట్రంలో కరోనా మ్యుటేషన్ ఎన్440కే వైరస్ ఉందంటూ చంద్రబాబు ప్రజలను భ్రయబ్రాంతులకు గురిచేశారని ఆయనపై న్యాయవాది సుబ్బయ్య ఇటీవల కర్నూల్ వన్టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడి పోలీసులు చంద్రబాబుపై ఐపీసీ 155, 505(1)(బీ)(2) సెక్షన్లతోపాటు 2005 ప్రకృతి వైపరీత్యాల చట్టం సెక్షన్-4 కింద కేసు నమోదు చేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.