చెన్నై: తమిళనాడులో కరోనా తీవ్రత కొనసాగుతున్నది. గత కొన్ని రోజులుగా పది వేలకుపైగా కరోనా కేసులు, వందల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. మంగళవారం నుంచి బుధవారం వరకు కొత్తగా 10,448 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో మరో 270 మంది కరోనాతో మరణించారు. దీంతో తమిళనాడులో మొత్తం కరోనా కేసుల సంఖ్య 23,88,746కు, మొత్తం మరణాల సంఖ్య 30,338కు చేరింది. ప్రస్తుతం 1,14,335 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. గత 24 గంటల్లో 21,058 మంది కరోనా రోగులు కోలుకున్నారని, కోలుకున్న వారి మొత్తం సంఖ్య 22,44,073కు చేరినట్లు వెల్లడించింది.