హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా సాగుతున్నది. మొత్తం 2.2 కోట్ల మందికి టీకాలు వేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. ఇందులో సగం మందికి ఒక్కడోస్ వేశారు. తొలిడోస్ తీసుకు న్న రెండువారాల తర్వాతి నుంచే టీకా పనిచేయడం ప్రారంభిస్తుందని అధ్యయనాలు చెప్తున్నాయి. దీని ని బట్టి రాష్ట్రంలో నిర్ణయించిన లక్ష్యంలో కనీసం స గం మందికి టీకాలు వేసినట్టేనని అధికారవర్గాలు తెలిపాయి. ఇప్పటివరకు 20 లక్షల మంది రెండు డోసులు తీసుకున్నారు. దీంతో వారికి కరోనా నుం చి సంపూర్ణ రక్షణ కలుగనున్నది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 940 ప్రభుత్వ కేంద్రాల్లో వ్యాక్సినేషన్ సాగుతున్నది. జీహెచ్ఎంసీలోనే 100 కేంద్రాలు ఉం డగా, ఇతర పట్టణాల్లో 204, గ్రామీణ ప్రాంతాల్లో 636 వ్యాక్సినేషన్ సెంటర్లు ఏర్పాటుచేశారు.
‘రక్షణ’ ప్రారంభమైనట్టే..
కరోనాను పూర్తిస్థాయిలో అడ్డుకోవాలంటే టీకాలు రెండు డోసులు వేసుకోవాలి. మొదటి డోస్ వేసుకున్నవారిలో కూడా ప్రతిరక్షకాలు ఉత్పత్తి అవుతాయని, అవి కొంతమేర రక్షణ కల్పిస్తాయని అనేక అధ్యయనాలు చెప్తున్నాయి. ‘మీరు ఒక్కడోస్ వేసుకున్నా కొవిడ్ నుంచి రక్షణ పొందుతున్నట్టే’ అని ప్రభుత్వం నియమించిన కొవిడ్-19 నిపుణుల బృందం చైర్మన్ డాక్టర్ ఎన్కే అరోరా ఓ సందర్భంలో స్పష్టంచేశారు. కొవాగ్జిన్, కొవిషీల్డ్, స్పుత్నిక్-వీ.. ఇలా ఏ టీకా అయినా మొదటి డోస్ తీసుకుంటే కనీసం 60 శాతం రక్షణ ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. కొవిషీల్డ్ మొదటి డోస్పై వెల్లూర్లోని సీఎంసీ జరిపిన పరిశోధనలో 61-65 శాతం సామర్థ్యాన్ని ప్రదర్శించగా, చండీగఢ్లోని పీజీఐ జరిపిన అధ్యయనంలో ఏకంగా 75 శాతం వరకు సామర్థ్యాన్ని ప్రదర్శిస్తున్నట్టు ప్రకటించింది. రాష్ట్రంలో ప్రాధాన్యవర్గాలకు ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించడంతో వ్యాక్సినేషన్ వేగం పెరిగింది. ప్రజలతో ఎక్కువగా సంబంధాలు కలిగి ఉన్నవారిని, ఇతర ప్రాధాన్యవర్గాలను గుర్తించి వారికి ముందుగా టీకాలు వేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు అధికారులు హైరిస్క్ గ్రూప్లైన.. రేషన్ డీలర్లు, ఆటో డ్రైవర్లు, మహిళా సంఘాలు, వీధి వ్యాపారులు, జర్నలిస్టులు తదితర వర్గాలను గుర్తించి నెల రోజుల్లోనే సుమారు 30 లక్షల మందికి టీకాలు వేశారు. ఈ విధానం దేశానికే ఆదర్శంగా నిలిచింది. ప్రస్తుతం విద్యార్థులకు ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్ కొనసాగుతున్నది.
ప్రత్యేక ప్రణాళిక కలిసివస్తున్నది
రాష్ట్రంలో నిరాటంకంగా వ్యాక్సినేషన్ కొనసాగుతున్నది. ఇప్పటివరకు కోటి మందికిపైగా కనీసం ఒక్క డోస్ తీసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన మేరకు టీకాల పంపిణీకి ప్రత్యేక ప్రణాళిక రూపొందించి, అమలుచేయడం కలిసివస్తున్నది. హైరిస్క్ గ్రూప్లకు ముందుగా టీకాలు వేయడం వల్ల వారికి కరోనా సోకే అవకాశాలు, వారి ద్వారా ఇతరులకు వ్యాప్తిచెందే అవకాశాలు తగ్గుతున్నాయి.
శ్రీనివాసరావు, డీఎంహెచ్