రెండోడోస్ వ్యాక్సినేషన్ను మంగళవారం నుంచి ప్రారంభించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అధికారులను ఆదేశించారు. ఇప్పటికే మొదటిడోసు పూర్తిచేసుకుని.. రెండో డోసు కోసం ఎదురుచూస్తున్నవారు సమీపంలోని ప్రభుత్వ వాక్సినేషన్ కేంద్రానికి వెళ్లి టీకా వేయించుకోవచ్చని సూచించారు. వైరస్ను వ్యాపింపజేసే అవకాశమున్న సూపర్ స్ప్రెడర్లను గుర్తించి వారికి ప్రత్యేకంగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించాలని.. ఇందుకు సంబంధించిన విధివిధానాలను రూపొందించాలని మంత్రి హరీశ్రావు, వైద్యారోగ్యశాఖ అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు.