కరోనా సెకండ్ వేవ్తో అల్లకల్లోలంగా మారిన నా దేశాన్ని ఆదుకోండి అంటూ బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా తన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లను కోరింది. ఇండియా, నా ఇల్లు. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత దారుణమైన కొవిడ్ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. మనం సాయం చేయాలి. రికార్డు స్థాయిలో ప్రజలు చనిపోతున్నారు. నేను గివ్ఇండియాతో ఒక ఫండ్రైజర్ను ప్రారంభించాను. ప్రస్తుతం కొవిడ్ సహాయక కార్యక్రమాలు చేపడుతున్న అతిపెద్ద సంస్థ ఇది. దీనికి ఎంతో కొంత సాయం చేయండి.
ఇన్స్టాలో నన్ను 6.3 కోట్ల మంది ఫాలో అవుతున్నారు. ఇందులో కనీసం లక్ష మంది ఒక్కొక్కరు కనీసం 10 డాలర్లు ఇచ్చినా పది లక్షల డాలర్లు అవుతుంది. అది చాలా ఎక్కువ. మీరిచ్చే విరాళాలు నేరుగా కొవిడ్ ఆసుపత్రుల్లో మౌలిక వసతుల కల్పనకు, వైద్య పరికరాల కొనుగోలుకు, వ్యాక్సిన్లకు వెళ్తుంది. దయచేసి విరాళమివ్వండి. నేను, నిక్ ఇప్పటికే ఇచ్చాము. ఇస్తూనే ఉంటాం. మనం ఈ వైరస్ను జయించాలి అని వీడియో సందేశాన్ని ఆమె ఇన్స్టాలో పోస్ట్ చేసింది.