హైదరాబాద్, ఆగస్ట్6 (నమస్తే తెలంగాణ): విధినిర్వహణలో ఉత్తమసేవలు అందిస్తున్నందుకుగాను ఐదుగురు ఐపీఎస్ అధికారులకు 2020 ఏడాదికి ఉత్కృష్ట్ సేవా పతకాలను ప్రదానం చేయనున్నట్టు డీజీపీ మహేందర్రెడ్డి శుక్రవారం సర్క్యులర్ను జారీచేశారు. పతకాలకు ఎంపికైన వారిలో సైబరాబాద్ సీపీ సజ్జనార్, హైదరాబాద్ నగర ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ అనిల్కుమార్, హైదరాబాద్ నగర శాంతిభద్రతల అడిషనల్ కమిషనర్ డీఎస్ చౌహాన్, హైదరాబాద్ జాయింట్ సీపీలు ఎం రమేశ్, విశ్వప్రసాద్ ఉన్నారు.