కాసిపేట-2 ఇైంక్లెన్లో మౌలిక సదుపాయాలు
ఉత్పత్తితో పాటు కార్మికుల బాగోగులపైనా యాజమాన్యం దృష్టి
ఇప్పటికే ఆర్వో ప్లాంట్.. క్యాంటీన్ ఏర్పాటు
రూ. 54 లక్షలతో మరుగుదొడ్లు, డ్రెస్సింగ్ రూమ్, బైక్, కార్ షెడ్లు
నేడు ప్రారంభించనున్న జీఎం శ్రీనివాస్
కాసిపేట, మార్చి 30 : మందమర్రి ఏరియాలోని కాసిపేట-2 ఇైంక్లెన్ గని 2019, జనవరిలో ప్రారం భం కాగా, ప్రగతి పథంలో దూసుకెళ్తున్నది. ప్రస్తుతం ఈ గనిలో 5 ఎస్డీఎల్ యంత్రాలు నడుస్తుండగా, 365 మంది కార్మికులు పనిచేస్తున్నారు. రక్షణతో కూ డిన ఉత్పత్తికి ప్రాధాన్యతనిస్తూ ముందుకెళ్తున్నామని గని అధికారులు తెలుపుతున్నారు. మరోవైపు అధిక ఉత్పత్తికి కృషి చేస్తున్న కార్మికులకు ప్రోత్సాహక బహుమతులు అందిస్తూ మరింత ఉత్సాహం నింపేందుకు యాజమాన్యం కృషి చేస్తుంది. కొవిడ్ కారణంగా గతేడాది 60 శాతం మేర ఉత్పత్తి కాగా, ప్రస్తుతం 82 శాతానికి పెరిగి దూసుకెళ్తున్నది.
మౌలిక సదుపాయాలపై దృష్టి..
నూతన గని కావడంతో యాజమాన్యం కార్మిక సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టంది. వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నది. దశల వారీగా సౌకర్యాలు కల్పిస్తూ ముందుకెళ్తున్నది. ఇప్పటికే ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేసి కార్మికులకు సురక్షితమైన నీరు అందిస్తున్నారు. క్యాంటీన్ కూడా ఏర్పాటు చేయగా, కొవిడ్ నేపథ్యంలో కేవలం టీ మాత్రమే ఇస్తున్నారు. క్యాంటీన్లో పనిచేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో కాసిపేట-1 గని క్యాంటీన్ నుంచి కార్మికుల కోసం టిఫిన్లు (అల్పాహారం) తెప్పిస్తున్నారు. త్వరలో ఈ సమస్య కూడా పరిష్కరిస్తామని కార్మిక సంఘాల నాయకులు తెలుపుతున్నారు. గనిలో సంక్షేమ అధికారి సైతం లేకపోవడంతో కార్మికులు పలు సమస్యలతో ఇబ్బందులు పడుతుండగా, ఇటీవల సంక్షేమ అధికారిని సైతం నియమించారు.
నేడు జీఎం చేతుల మీదుగా ప్రారంభం
కాసిపేట 2 ఇైంక్లెన్ గనిలో కార్మికుల సౌకర్యార్థం రూ. 54 లక్షలతో నూతనంగా మరుగుదొడ్లు, డ్రెస్సింగ్ రూమ్, బైక్ పార్కింగ్ షెడ్, కార్ షెడ్లను నిర్మించింది. మందమర్రి జీఎం చింతల శ్రీనివాస్ బుధవారం ప్రారంభించనున్నారు. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
టీబీజీకేఎస్ కృషితోనే సౌకర్యాలు
మందమర్రి ఏరియాలోని కాసి పేట-2 ఇైంక్లెన్ గనిలో కార్మి కుల సమస్యలపై ఎప్పటిక ప్పుడు వినతులు అందిం చాం. ఇందుకు యాజమా న్యం సానుకూలంగా స్పంది స్తూ దశల వారీగా సమస్యలు పరిష్కస్తు న్నది. గనిలో ప్రస్తుతం కార్మికులకు మరిన్ని మౌలిక సదుపాయాలు కల్పించేందుకు టీబీజీకేఎస్ కృషి చేస్తున్నది. అంతర్గత రోడ్ల నిర్మాణం కోసం కూడా వినతి పత్రిం అందించాం. ఇందుకు అధికారులు స్పందించారు. త్వరలో టెండర్ ఉంటుంది.
– కారుకూరి తిరుపతి,టీబీజీకేఎస్ పిట్ కార్యదర్శి, కాసిపేట-2 గని
ఇవి కూడా చుడండి
గోల్కొండ కోటను పరిరక్షించండి
స్వరాష్ట్రంలోనే విద్యుత్తుకాంతులు