ఓయూ జేఏసీ నేత రాజారాం యాదవ్ వెల్లడి
కమలాపూర్, ఆగస్టు 9 : వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలంలోని ఉప్పలపల్లి యాదవులు సీఎం కేసీఆర్ వెంటే ఉంటామని ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్టు ఓయూ జేఏసీ నేత రాజారాంయాదవ్ సోమవారం తెలిపారు. బడుగు బలహీన వర్గాల ఆత్మబంధువు కేసీఆర్ అని ఆయన పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు అన్ని రంగాల్లో సముచిత స్థానం కల్పిస్తున్న ఏకైక వ్యక్తి కేసీఆర్ అని కొనియాడారు. సీఎం కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధికి ఆకర్షితులై టీఆర్ఎస్కు మద్దతు తెలుపాలని నిర్ణయించుకున్నట్టు వెల్లడించారు. కార్యక్రమంలో యాదవ సంఘం మండల అధ్యక్షుడు పీ రాజయ్య, సభ్యులు ఐలయ్య, రాజు, శ్రీనివాస్, బాలరాజ్, పాకలక్ష్మి, రాజేశ్వరి, లక్ష్మి పాల్గొన్నారు.