జగిత్యాల: జిల్లాలో ధర్మపురి మండలంలో ప్రమాదవషాత్తు నీటిలో మునిగి ఓ వృద్ధురాలు మృతిచెందింది. ధర్మపురి మండలంలోని రాయపట్నం పుష్కర ఘాటు వద్దకు స్నానం చేయడానికి గుర్తుతెలియని వృద్దురాలు వచ్చింది. ఈ క్రమంలో ప్రమాదవషాత్తు నీటిలో మునిగి చనిపోయింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాదీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి