హైదరాబాద్, సెప్టెంబరు 9 (నమస్తే తెలంగాణ): పీఎం స్వనిధి పథకంలో భాగంగా వీధి వ్యాపారులకు రుణాలు ఇవ్వడంలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాలశాఖ కార్యదర్శి దుర్గాశంకర్ మిశ్రా ప్రశంసించారు. దిల్లీ నుంచి గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన సీఎస్ సోమేశ్కుమార్, మెప్మా ఎండీ, సీడీఎంఏ సత్యనారాయణను అభినందించారు. తెలంగాణలో అమలుచేస్తున్న పట్టణ ప్రగతి ప్రారంభం కార్యక్రమంలో రాష్ట్ర మున్సిపల్ మంత్రి కేటీఆర్ వీధి వ్యాపారులకు పెట్టుబడి రుణాలు అం దించాలని అధికారులను ఆదేశించారు. ఆ మేరకు ‘పట్టణ ప్రగతి- సర్వే ఆఫ్ స్ట్రీట్ వెం డర్స్’ అనే ప్రత్యేక మొబైల్ యాప్ ద్వారా రాష్ట్రంలో 5,18,912 మంది వ్యా పారులను గుర్తించారు. ఇందులో 3,40,000 మందికి పెట్టుబడి రుణాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకొని ఇప్పటివరకు 3,57,619(105.17శాతం) మందికి అం దించారు. దీంతో పీఎం స్వనిధి అమలులో రాష్ట్రం దేశంలోనే మొదటిస్థానంలో నిలిచింది. వీధి వ్యాపారులకు డిజిటల్ చెల్లింపులు చేయడంలోనూ తెలంగాణ మొదటిస్థానంలో నిలిచింది.