తెలంగాణ పల్లెల్లోప్రణాళికాయుతఅభివృద్ధి
దేశవ్యాప్తంగా కార్యక్రమం అమలుకు కృషి
కేంద్రమంత్రి కపిల్ మోరేశ్వర్ పాటిల్ వెల్లడి
ఆర్థికసంఘం నిధులు పెంచండి: ఎర్రబెల్లి
హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ)/ రామన్నపేట: తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న పల్లెప్రగతి కార్యక్రమం మంచి ఫలితాలు ఇస్తున్నదని, పంచాయతీల్లో ప్రణాళికబద్ధంగా అభివృద్ధి జరుగుతున్నదని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సహాయ మంత్రి కపిల్ మోరేశ్వర్పాటిల్ కొనియాడారు. ఈ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లి దేశమం తా అమలుచేసేలా చూస్తామని పేర్కొన్నారు. శుక్రవారం రాష్ర్టానికి వచ్చిన కేంద్రమంత్రి యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి, చౌటుప్పల్ మండలం ఎస్ లింగోటం, పంతంగి గ్రామాల్లో పర్యటించారు. ఆయా గ్రామాల్లో నిర్మించిన పల్లె ప్రకృతి వనం, రైతు వేదిక, వైకుంఠధామం, నర్సరీ, డంపింగ్ యార్డులను పరిశీలించారు. మహిళా సంఘాల సభ్యులు ఏర్పాటు చేసిన గ్రామీణ ఉత్పత్తుల ప్రదర్శనను తిలకించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పల్లె ప్రగతి కార్యక్రమంతో తెలంగాణలో పల్లెల సమగ్ర స్వరూపం మారిపోయిందని ప్రశంసించారు. కేంద్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి నేరుగా నిధులు విడుదల చేస్తూ స్థానిక సంస్థల బలోపేతానికి కృషి చేస్తున్నదని చెప్పారు. ఉపాధి హామీ నిధులతో రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో నర్సరీలు, హరితహారం కార్యక్రమం చేపట్టడాన్ని కొనియాడారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పేదలకు అవసరమైన ఇండ్ల మంజూరుకు కేంద్రం సిద్ధంగా ఉన్నదని చెప్పారు. అంతకుముందు కేంద్రమంత్రి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు మంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
పంచాయతీ భవనాల నిర్మాణానికి నిధుల్విండి
స్థానిక సంస్థలకు 15వ ఆర్థిక సంఘం ద్వా రా అందిస్తున్న గ్రాంటును పెంచాలని కేంద్రమంత్రి కపిల్ మోరేశ్వర్ను రాష్ట్రమంత్రి ఎర్రబె ల్లి దయాకర్రావు కోరారు. 14వ ఆర్థిక సంఘం తో పోల్చితే 15వ ఆర్థిక సంఘం గ్రాంటు తక్కువగా ఉన్నదన్నారు. హైదరాబాద్లోని హోటల్ మారియట్లో కేంద్రమంత్రిని ఎర్రబెల్లి మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో వెయ్యి గ్రా మ పంచాయతీల భవనాల నిర్మాణానికి రూ. 200 కోట్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశా రు. ఈ వినతిపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారని దయాకర్రావు తెలిపారు.