మేడ్చల్ జిల్లాలోని 13 మున్సిపాలిటీల పరిధిలో 13 సమీకృత వెజ్-నాన్వెజ్ మార్కెట్లను నిర్మించేందుకు ప్రభుత్వ జిల్లా యంత్రాంగం స్థలాలను ఎంపిక చేసింది. అంచనా కమిటీ పరిశీలించి ఈ స్థలాలకు నిధుల కేటాయింపుపై నిర్ణయం తీసుకోనున్నది. వీరి నివేదిక ఆధారంగా ప్రభుత్వం నిధులు మంజూరు చేయనున్నది.
జిల్లాలోని 13 మన్సిపాలిటీలలో జనావాసాలకు దగ్గరలోనే సమీకృత మార్కెట్లను నిర్మించనున్నారు. విక్రయదారులు, కొనుగోలుదారులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు స్థలాలను ఎంపిక చేశారు. మార్కెట్ల నిర్మాణానికి మరింత స్థలం అవసరమైతే సేకరించేందుకు సిద్ధంగా ఉన్నామని అధికారులు తెలిపారు. మార్కెట్లలో తారునీరు, టాయిలెట్ల సౌకర్యం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.