న్యూఢిల్లీ : రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ శుక్రవారం స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. ఛాతిలో నొప్పి రావడంతో ఆయన ఢిల్లీలోని ఆర్మీ హాస్పిటల్ (ఆర్అండ్ఆర్)కు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయనకు వైద్యులు ఆరోగ్య పరీక్షలు చేశారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని, ఆరోగ్యం పరిస్థితి నిలకడగానే ఉందని ఆర్మీ హాస్పిటల్ వైద్యులు తెలిపారు.